Tag Archives: PM Modi

BRS-కాంగ్రెస్‌కు ఉన్న లింక్ ఇదే.. మోడీ సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు. నాణేనికి ఒక వైపు కాంగ్రెస్ అయితే మరోవైపు బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉందన్నారు. బీఆర్ఎస్ చేసిన కాళేశ్వరం అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. అవినీతి బంధాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందని ఆరోపించారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందన్నారు. అయితే.. కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆర్ఎస్ అవినీతిని ...

Read More »

ఆదిలాబాద్ సభలో ఒకే వేదికపై మోదీ, రేవంత్ రెడ్డి..

ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోదీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మోదీని ...

Read More »

మంగళగిరి ఇన్చార్జిగా మాజీ మంత్రి కోడలు… వైసీపీ 9వ జాబితా విడుదల

విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న అధికార వైసీపీ నేడు 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లే ఉన్నప్పటికీ, అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. మంగళగిరిలో నారా లోకేశ్ కు పోటీగా గతంలో గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్… నేడు కొత్త ఇన్చార్జిని తీసుకువచ్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను కొత్త ఇన్చార్జిగా ప్రకటించారు. మురుగుడు లావణ్య ఇవాళ రాత్రి 7 గంటలకు వైసీపీలో చేరగా, కొన్ని గంటల్లోనే ఆమె పేరు అభ్యర్థుల జాబితాలో చేర్చారు. మురుగుడు ...

Read More »

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభంతో పాటు, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగసభలలో కూడా ఆయన పాల్గొననున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌‌కు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం బయలుదేరి తమిళనాడు వెళ్తారు. తిరిగి అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు వస్తారు. ఆ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస ...

Read More »

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు…

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారక నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్కు సాయంతో సముద్రం అడుగుభాగానికి చేరుకున్నారు. అక్కడి పుణ్యభూమికి భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తనతోపాటు తీసుకెళ్లిన నెమలి పింఛాలను వింజామరలా వీచారు. అనంతరం ఆ పింఛాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుడ్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడయాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు. మహాభారత కాలం నాటి ద్వారక నగరం… శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం ...

Read More »

రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన ఎయిమ్స్‌ ను రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అంతేకాక 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే,రాయ్‌బరేలి,రాజ్‌కోట్‌, భటిండా, కల్యాణి ఎయిమ్స్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతీ పవార్‌,ప్రహ్లాద్‌ జోషిలు పాల్గొననున్నారు.

Read More »

మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర ఈరోజు ప్రారంభమయింది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు పోటెత్తుతుండటంతో మేడారం భక్తజన సముద్రంగా మారింది. మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క – సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం ...

Read More »

25వ తేదీన 5 ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని..!

మంగళగిరితోపాటు దేశంలో కొత్తగా నిర్మించిన ఐదు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి ఈ నెల 25న అంకితం చేయనున్నారు. అలాగే విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీ, 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీలను కూడా ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారు. మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆస్పత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం రూ. 1,618 కోట్లు ఖర్చు చేసింది.

Read More »

తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంలను ప్రారంభించిన మోదీ

తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంలను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిని జమ్మూకశ్మీర్ నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. విశాఖ ఐఐఎంను 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ భవనాలను పూర్తి చేశారు. తిరుపతి ఐఐటీని కూడా తాత్కాలిక క్యాంపస్ లో నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటీ, శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలను పూర్తి చేశారు. ఈ భవనాలన్నింటికీ ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ...

Read More »

విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏడాదికి రెండు సార్లు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు..

10,12 తరగతుల విద్యార్థులు యేటా రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ తరగతుల బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. రెండుసార్లు పరీక్షలు రాసి, మెరుగైన స్కోరునే అంతిమంగా ఉంచుకుని, మిగిలిన దానిని రద్దు ...

Read More »