Tag Archives: sushanth case

సుశాంత్ రాజ్‌పుత్ కేసులో ఏ సమాచారం లీక్‌ కాలేదు : సిబిఐ

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు సంబంధించి ఏటువంటి సమాచారాన్ని.. ఏ సమయంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ). నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి)లు లీక్‌ చేయలేదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఎఎస్‌జి) అనిల్‌ సింగ్‌ బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్‌ ఈ ఏడాది జూన్‌ 14న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రచారాన్ని, రిపోర్టింగ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బాంబే హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ ...

Read More »

రియా చక్రవర్తి బెయిల్‌ తిరస్కరణ

డ్రగ్స్‌ కేసులో గత వారం అరెస్ట్‌ అయిన నటి రియాచక్రవర్తికి ముంబయి కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. కేసు ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో రియాను బెయిల్‌పై విడుదల చేస్తే.. ఈ కేసులో ఇతర నిందితులను ప్రభావితం చేయవచ్చని కోర్టు పేర్కొంది. అలాగే సాక్ష్యాధారాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నిందితురాలికి  బెయిల్‌ పొందే అర్హతలేదని  సెషన్స్‌ కోర్టు జడ్జి తెలిపారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం డ్రగ్స్‌ను సేకరించడాన్ని నాన్‌ బెయిలబుల్‌ కేసుగా  పేర్కొ‌న్నా‌రు.  ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ...

Read More »

రియా అరెస్టులో రాజకీయ కుట్ర?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతూ ఆయన ప్రేయసి రియా చక్రవర్తి అరెస్టుకు దారి తీసింది. సుశాంత్‌ ఆత్మహత్యను ముంబయి ప్రభుత్వం పట్టించుకోలేదని బీహార్‌ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆ కేసును సిబిఐకి అప్పగించాలని కోరింది. ఓట్ల కోసం బిజెపి పన్నిన ఎత్తుగడే ఇదని విమర్శలు ఉన్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ డ్రగ్స్‌ కేసులో దోషిగా తేలుస్తూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) మంగళవారం రియాను అరెస్టు చేసింది. దీని వెనుక రాజకీయ కుయుక్తులు ...

Read More »

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్టు

 సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కేసులో రియాను మూడు రోజుల నుండి ఎన్‌సిబి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా ఎన్‌సిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే తాను మాత్రం డ్రగ్స్‌ వాడలేదని, సుశాంత్‌ కోసమే కొనుగోలు ...

Read More »

రియా సోదరుడు, సుశాంత్‌ మేనేజర్‌ అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్‌, మిరండా నివాసాల్లో ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. షోవిక్‌ చక్రవర్తి గంజాయి, ...

Read More »

సుశాంత్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

సుశాంత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాచక్రవర్తి సోదరుడు, నటుడు షోయిక్‌కి డ్రగ్స్‌ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఈ నిందితులకు సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో సంబంధాలు ఉన్నాయని, షోయిక్‌ సూచనల మేరకే మిరాండాకు డ్రగ్స్‌ ఇచ్చేవారని ఎన్‌సిబి తెలిపింది. షోయిక్‌, మిరాండాల మధ్య వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా బాంద్రాకు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌, అంథేరికి చెందిన జైద్‌ విలత్రాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇద్దరు నిందితులను పోలీసుల కస్టడీని కోరుతూ కోర్టులో ...

Read More »

సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి సేకరించిన అన్ని ఆధారాలను సిబిఐకి అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి సహకరించాలని పేర్కొంది. బీహార్‌ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణకు మహారాష్ట్ర ప్రభత్వం వ్యతిరేకించడంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ...

Read More »

సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగింత!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మతి పట్ల యావత్‌ దేశ వ్యాప్తంగా అనుమానాలు వెల్లెవెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ సుశాంత్‌ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తున్నట్టు వెల్లడించింది. గత కొంత కాలంగా సుశాంత్‌ కేసు కొలిక్కి రావడం లేదు. రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తోంది. దీనికి తోడు సుశాంత్‌ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సుశాంత్‌ తండ్రి పెట్టిన కేసు విచారణ కోసం ...

Read More »