లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన పలు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా, మరికొన్నింటిని ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరగాల్సి ఉంది.రాష్ట్రంలో మే 13 నుంచి లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్పుచేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా.. మే 9, 10, 11 ఇంజనీరింగ్ తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే, జూన్ ...
Read More »Tag Archives: telangana
రాజన్న సిరిసిల్లలో కలకలం.. 10 మంది పోలీస్ సిబ్బందిపై ఒకేసారి వేటు
అవినీతి పోలీస్ అధికారులుపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. నిర్లక్ష్యానికి పాల్పడ్డ సిబ్బందిని సైతం వదలనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వేములవాడలో ఓ మహా పర్వదినంలో అవినీతితో పాటు విధుల్లో నిర్లక్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐదుగురు హోంగార్డులను మొత్తం పదిమంది పోలీస్ సిబ్బందిని ఏఆర్ హెడ్ క్వార్టర్కు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ అటాచ్ చేసినట్లు సమాచారం. అవినీతి పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీస్ బాస్పై జిల్లా ప్రజల ...
Read More »పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఝార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు.
Read More »తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పాటు తమిళి సై చూసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ప్రెసిడెంట్ రాధాకృష్ణన్కే అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. ...
Read More »తెలంగాణకు గవర్నర్గా రాబోతోంది ఎవరో తెలుసా?
లోకసభ ఎన్నికల వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. అదేవిధంగా పుదుచ్చేది లెఫ్ట్నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తు్న్న దృష్ట్యా కొత్త గవర్నర్ నియామకం ప్రస్తుతం లేనట్లుగనే తెలుస్తోంది. దీంతో మరో ...
Read More »ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభంతో పాటు, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగసభలలో కూడా ఆయన పాల్గొననున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్కు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం బయలుదేరి తమిళనాడు వెళ్తారు. తిరిగి అదే రోజు రాత్రి హైదరాబాద్కు వస్తారు. ఆ రోజు రాత్రి రాజ్భవన్లో బస ...
Read More »తెలంగాణలో మరోసారి ఐఏఎస్ల బదిలీ
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఇరిగేషన్ డిపార్టమెంటు స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. అక్కడి కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించారు. ...
Read More »అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్..!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది ఈ నెల 24వ తేదీన ఆయన రాష్ట్రానికి రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఈయన పాల్గొబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రచారాన్ని మొదలుపెట్టింది కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రావాలని తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలని కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ...
Read More »మీకు ఈ పండుగ తెలుసా…
తెలంగాణలో పండుగలు ఎలా జరుపుకుంటారో మనకి తెలిసిందే. ప్రతి ప్రాంతానికి ఒక్కో సంప్రదం. అయితే విటీని పల్లెటూళ్లలో ఎక్కువగా పాటిస్తుంటారు. అత్తా కోడళ్లు, ఆడబిడ్డల పేరుతో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త పండుగలు వస్తున్నె ఉన్నాయి. అవి మన ముందుకు వచ్చే వరకు తెలియడం లేదు. సంక్రాంతి సమయంలో గాజులు మార్చుకోవాలంటూ ఓ వార్త తెగ హల్చల్ అయింది. ఇప్పుడు కూడా మనమందరం షాక్ అయ్యే బరువు పండుగ వచ్చేసింది. అన్ని వరుసల పండుగలు అయ్యాయి. ఈసారి వదిన మరదళ్ల పండుగట. వారిద్దరూ ...
Read More »ఇవాళ ఇండియా వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు బంద్
ఇవాళ ఆటోలు, క్యాబ్లు బంద్కానున్నాయి కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తో నష్టపోయిన తమను ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక అటు నేడు భారత్ బంద్. ఈ బంద్ దేశ వ్యాప్తంగా కొనసాగనుంది. కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు ...
Read More »