తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవాన్ని సైతం ఏకాంతంగా జరిపించేందుకు నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చారు. నిత్య సేవల్లో భాగమైన వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ, సహస్ర కలశాభిషేకం సేవలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు కూడా వైకుంఠం క్యూకాంప్లెక్స్లో వేచి ఉండే అవసరం ...
Read More »