అల్పపీడన ప్రభావం వల్ల.. తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలతో.. అక్కడి స్థానికులు ఇబ్బందులు పడటం చూసి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు తిరుపతి, తిరుమలలో కురవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే నా మనసు కలిచివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడిలు సమిష్టి కృషి చేసి వరద ముప్పు నుంచి వారిని కాపాడాలి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన ...
Read More »Tag Archives: tollywood news
టైసన్ను కలిసిన ‘లైగర్’
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా హైప్ రావడానికి ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను ...
Read More »రాజీవ్ కోటి సినిమా నుంచి ఫస్ట్ లుక్
కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా.. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ’11:11′ ప్రారంభమైంది. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ను గురువారం చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటిగారు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సంగీతం అందించారు. నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటిలదే అని చెప్పాలి. ఇద్దరూ నా ...
Read More »డిసెంబరులో సూర్య యాక్షన్ థ్రిల్లర్
పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎదర్కుమ్ తునిందవన్’ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నారు. సూర్య.. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రతి ...
Read More »పెళ్లి పీటలెక్కనున్న కత్రినాకైఫ్
బాలీవుడ్ ప్రేమికులు కత్రినాకైఫ్, నటుడు విక్కీకౌశల్ త్వరలో పెళ్లి పీటలెకక్కనున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 7,8,9 తేదీల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేడుక కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగరోజున వీరి పెళ్లి తంతు కంటే ముందు జరిగే రోకా వేడుక జరిగిందని ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోకా వేడుక కత్రినాకు ఆప్తుడైన దర్శకుడు కబీర్ఖాన్ నివాసంలో జరిగిందట. ఈ వేడుకలో కత్రినా తల్లి సుజానే టర్కోయెట్, సోదరి ఇసాబెల్ పాల్గొన్నారు. అలాగే ...
Read More »ఫిబ్రవరిలో శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు.దీపావళి సందర్బంగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా విడుదల ...
Read More »హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం
సినీ నటుడు రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసారు. శుక్రవారం ఉదయం వరదరాజన్ భౌతికకాయాన్ని చెన్నైకు తరలిస్తారని సమాచారం. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్ వరదరాజన్ గోపాల్కు రెండో సంతానం.
Read More »‘పెద్దన్న’ కోసం ప్రచారం మొదలుపెట్టిన ముద్దుగుమ్మలు
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్ నుంచి రావడంతో రజినీ ప్రమోషన్స్ కి ...
Read More »సమస్యలను పరిష్కరించవచ్చు :సోనూసూద్
కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో సాయం కోరుతూ ఎంతోమంది సోనూకి ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ”సాయం కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల నాకెలాంటి ఇబ్బందిలేదు. కానీ, వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా? అని బాధగా అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి… ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చు” అని సోనూసూద్ పేర్కొన్నారు.
Read More »స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కైకాల సత్యనారాయణ
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత రాత్రి ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. నిన్న రాత్రి ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రెండేళ్ల నుంచి కైకాల సత్య నారాయణ సినిమాల్లో నటించట్లేదు.
Read More »