Tag Archives: ycp

జనసేన అధినేత పవన్‌పై కొడాలి నాని ఫైర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అనుసరించి ...

Read More »

పరిశ్రమలకు 70 శాతం విద్యుత్‌ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్‌ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్‌ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 235 మిలియన్‌ యూనిట్ల నుంచి 186 మిలియన్‌ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read More »

పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన వైసిపి ఎంపి

 వైసిపి ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బిపి, షుగర్‌ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు.ఈ ఘటనపై  సహచర ఎంపిలు  వెంటనే స్పందించారు. స్ట్రెచర్‌ తెప్పించి ఆయన్నిస్థానిక  రామ్‌ మనోహర్‌ లోహియా  ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఐసియులో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు.

Read More »

బద్వేలు ఉప ఎన్నికలో వైసిపి ఘన విజయం

 బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో అధికార‌ వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి సుధ భారీ మెజారిటీ సాధించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యే స‌రికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్‌ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో వైసీపీ గెలుపు లాంఛ‌న‌మైపోయింది.

Read More »

వైసిపి నాయకులు జనాగ్రహ దీక్షలు

టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు కూడా దీక్షలు జరుగుతున్నాయి.   సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.  అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే పద్మావతి, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ...

Read More »

చిరంజీవి, నాగార్జున కోరడంతోనే ఆన్‌లైన్‌ టికెట్లు: రోజా

వైసీపీ పార్టీ, నగరి ఎమ్యెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆఅ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు ...

Read More »

రాష్ట్రీయం మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదు

శాసనసమండలిని రద్దు చేయాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలి రద్దు తీర్మానం అనేది ఎత్తుగడలో భాగంగా తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మండలి వ్యవస్థ ఉండకూడదనేదే తమ ఉద్దేశ్యమమన్నారు. ప్రతిపక్షం శాసనమండలిని నవ్వలాటగా మార్చిందని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. గవర్నర్‌ కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్ధుల ప్రమాణస్వీకారం సందర్భంగా సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More »

వైసిపి సీనియర్‌ నేత గున్నం నాగిరెడ్డి కరోనాతో మృతి

వైసిపి సీనియర్‌ నేత గున్నం నాగిరెడ్డి (81) మంగళవారం ఉదయం మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. స్వగ్రామం అయిన చింతలపాలెం మండలంలోని దొండపహాడులో నాగిరెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Read More »

అరిచినా.. మొరిగినా.. బెదిరేది లేదు : కొడాలి నాని

చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడం, దీనిపై టిడిపి నాయకుల విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కాంలు చేశారని ఆరోపించారు. సిఆర్‌డిఎ చట్టాలన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఒలతో దళిత వర్గాలను మోసం చేశారని పేర్కొన్నారు. వారిని బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్రపు ధర చెల్లించి కోటు కాజేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. బుద్ధా వెంకన్న మొరుగుతున్నా.. మేం ...

Read More »

ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసిపి

అసెంబ్లీ కోటా నుండి ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసిపి ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో పేర్లను ప్రకటించారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా భగీరథరెడ్డి, సి.రామచంద్రయ్య, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌లు ఉన్నారు.

Read More »