Tag Archives: ysrcp mp

నరసరావుపేట ఎంపీగా అనీల్ కుమార్…?

నరసరావుపేట శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి పరిశీలనలో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుట్టా రేణుక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి విడదల రజనీల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బుట్టా రేణుక, మంత్రి విడదల రజిని, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. నరసరావు పేట ఎంపీగా అనిల్ కుమార్ నే పోటి చేయిస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తుంది.

Read More »

చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మరిచి పోలేదంటూ’’ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించారు.‘‘ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అరిచినట్టు లేదూ?’’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Read More »

ఎంపీ రఘురామపై జగన్ వ్యూహం ఇదే.. లోక్‌సభ స్పీకర్‌తో ఎంపీల బృందం భేటీ..

ఎంపీ రఘురామపై జగన్ వ్యూహం ఇదే.. లోక్‌సభ స్పీకర్‌తో ఎంపీల బృందం భేటీ..

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం భేటీ అయింది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు కోరారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన వారిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లావు కృష్ణదేవరాయ, మార్గాని భరత్, నందిగం సురేష్ ఉన్నారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ ఓం బిర్లాను ఆ పార్టీ నాయకత్వం కోరినట్లు సమాచారం. శుక్రవారం ...

Read More »

చంద్రబాబుకు నందిగం సురేష్‌ సవాల్‌

రాజధాని ప్రాంతంలో తాను భూములను కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ సవాల్‌ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో తానూ తన అనుచరులు భూమిని కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.సొమవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేష్‌ మాట్లాడారు. ‘నిజనిర్ధారణ కమిటీ వేస్తే టీడీపీ నేతలు చేసిన అరాచకం బయటపడుతుంది. చంద్రబాబుది కోర్టు స్టేల బతుకు. నిజాలు ...

Read More »

కరోనా పరీక్షలు చేయించుకున్న విశాఖ ఎంపీ

కరోనా పరీక్షలు చేయించుకున్న విశాఖ ఎంపీ

స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఎంపీకి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Read More »