కేంద్ర బడ్జెట్ 2022–23ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2022–23ని ఆధారంగా రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం అన్న నాలుగు అంశాలే స్తంభాలుగా ఈ బడ్జెట్ను రూపొందించామని ఆమె చెప్పారు.
ఈ బడ్జెట్లోని ప్రధానమైన అంశాలు..
– రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు: రూ. లక్ష కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ఆ సొమ్ము నుంచి వడ్డీలేని రుణాలు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చెప్పారు.
– 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు: రూ.7.5 లక్షల కోట్లు కేటాయింపు
– వన్ క్లాస్.. వన్ టీవీ చానెల్: ప్రతి తరగతికి ఒక టీవీ చానెల్ ద్వారా పాఠాలు. ఈ ఎడ్యుకేషన్ ద్వారా ప్రాంతీయ భాషల్లో పాఠాలు చెప్పేందుకు ప్రస్తుతం ఉన్న 12 ఎడ్యుకేషన్ చానెళ్లను రెండు వందలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
– 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్గ్రెడేషన్
– 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్ బ్యాంక్స్)
– అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు. డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
– ఇకపై డిజిటల్ పాస్పోర్టులు. చిప్ ఆధారిత పాస్పోర్టులు మంజూరు
– పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణ లక్ష్యం
– పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు
– వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు
– దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం
– నేషనల్ హైవేస్ను 25 వేల కిలోమీటర్లకు పెంపు
– మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
– వంట నూనెల దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు
– పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
– రూ.250 కోట్లుతో ఐదు విద్యా సంస్థల ఏర్పాటు
– ఇకపై బిల్లుల చెల్లింపులు వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్లైన్లోనే నిర్వహించేలా నిర్ణయం
– త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు
– 2022–23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్
– ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్ఈజెడ్(స్పెషల్ ఎకనమిక్ జోన్)లో సమూల మార్పులు, ఎస్ఈజెడ్ల చట్టంలో మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి.
– రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు: డిఫెన్స్ ఆర్ అండ్ డీ బడ్జెట్లో 68 మేకిన్ ఇండియాకే.
– రక్షణ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగమయ్యేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు అవకాశం. డిఫెన్స్ ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వీటికి కేటాయింపు.
– పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
– ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల మేర రోప్వేలు
– సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19,500 కోట్ల కేటాయింపులు
– 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్
– ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్
– ఇంటింటికీ నల్లా నీళ్లు: ఈ ఏడాది 3.8 కోట్ల ఇళ్లను కవర్ చేసేందుకు రూ.60 వేల కోట్ల కేటాయింపు
– నదుల అనుసంధానానికి ప్రణాళికలు: ఈ ప్రాజెక్టులో గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదులు కూడా ఉన్నాయి.
– వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్
– పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు
– ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
– త్వరలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
– ఎలక్ట్రికల్ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
– త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
– ముందుగా పట్టణాల ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగానికి ప్రణాళికలు
– పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
– వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన
– వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు.
– చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్నేషన్ వన్ప్రొడక్ట్ పథకం అమలు
– 2023 నాటికి కొత్తగా 2 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు పెంపు టార్గెట్
– రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు
– చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్
– భారత్లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ
– వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్లను అభివృద్ధి
– దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం
– ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్న్స్లో లోపాల్ని సరిచేసుకునే వీలు
– యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ సెక్టార్లో యువతకు పెద్ద ఎత్తున ఎంప్లాయిమెంట్: ఈ రంగంలో ప్రోత్సాహం కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్