హీరో విశాల్ బండారం బయటపెడతానంటున్న రమ్య

తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవలే తన ఆఫీసులో పనిచేస్తున్న రమ్య అనే మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆఫీసులో పనిచేస్తున్న ఆమె తనకు తెలియకుండా రూ. 45 లక్షలు కాజేసిందని పోలీసుల్ని ఆశ్రయించాడు. నిర్మాతగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలు తీస్తున్న ఆయన, హరి, రమ్య అనే ఇద్దరిని ఉద్యోగులుగా నియమించుకోగా, ఇరువురూ కలిసి ఆరేళ్ల వ్యవధిలో లక్షల డబ్బు కొట్టేశారన్నది విశాల్ వారిపై ఆరోపణలు చేశాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై రమ్య ఘాటుగా స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు దానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించింది.