వైసిపి నాయకులు జనాగ్రహ దీక్షలు

టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు కూడా దీక్షలు జరుగుతున్నాయి.   సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.  అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే పద్మావతి, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో రెండో రోజు జనాగ్రహ దీక్ష కొనసాగుతుంది.  విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో రెండోరోజు దీక్ష కొనసాగుతుంది. స్థానిక వైసిపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.