వైసీపీ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, రిటైర్డ్ ఐఏఎస్ డా.చంద్రమౌళి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో చనిపోయారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన చంద్రమౌళి, రిటైర్డ్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు.

చంద్రబాబుపై పోటీ చేసిన కుప్పం వైసీపీ అభ్యర్థి కన్నుమూత...