దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం సాయంత్రం ఈ భేటీ ప్రారంభమైంది. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వంటి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే ఏప్రిల్ 20 తరువాత దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ను సడలించనున్న నేపథ్యంలో దీనిపై కూడా ప్రధాని మంత్రులతో చర్చించనున్నారు.

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ