55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
– మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
– నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు
– మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
– నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు
– మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్
– ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.