అజ్ఙాతంలో కొల్లు ర‌వీంద్ర‌

ఇటీవల జరిగిన మోకా భాస్కర్‌రావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోలీస్‌ స్టేషన్‌లో భాస్కర్‌రావు వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవీంద్ర ఇంటిని సోదా చేశారు. విషయం తెలుసుకున్న కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, మోకా భాస్కర్‌రావు హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని భాస్కర్‌రావు వర్గీయుల ధర్నాకు దిగారు