అనాస పండుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?

కరోనా వైరస్ నేపథ్యంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుంటే. కొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటికి రుచి.. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ‘అనాస పండు’ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిందే. ఔనండి.. అనాస పండు (పైనాపిల్)తో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా కరోనా వైరస్‌పై పోరాడే శక్తిని కూడగట్టుకోవచ్చు. మరి, అనాస పండు తినడం వల్ల శరీరానికి కలిగే మరిన్ని ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా!

అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు.
అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది.
అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది.
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది.
అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మేని ఛాయ కూడా నిగారింపు కూడా వస్తుంది.
అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి. ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు.
అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.