అరిచినా.. మొరిగినా.. బెదిరేది లేదు : కొడాలి నాని

చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడం, దీనిపై టిడిపి నాయకుల విమర్శలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కాంలు చేశారని ఆరోపించారు. సిఆర్‌డిఎ చట్టాలన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జిఒలతో దళిత వర్గాలను మోసం చేశారని పేర్కొన్నారు. వారిని బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్రపు ధర చెల్లించి కోటు కాజేశారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. బుద్ధా వెంకన్న మొరుగుతున్నా.. మేం అదిరేది లేదు, బెదిరేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన వారికి సిఐడి నోటీసులు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.