సింహగిరిలో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. ఎపి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, హీరోశర్వానంద్లు లక్ష్మీనృషింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సంద్భంగా అవంతి శ్రీనివాస్ను, హీరో శర్వానంద్ మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. అనంతరం శర్వానంద్ నటిస్తున్న మహాసముద్రం చిత్రం షూటింగ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కుటంబం, హీరోయిన్ అదితీరావు హైదరీలపై సీన్ను షూట్ చేశారు. సినిమా షూటింగ్ను 34రోజుల పాటు విశాఖలో చేశామని, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నామని చిత్రయూనిట్ తెలిపింది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు. మహాసముద్రం చిత్రం దర్శకుడు అజరుభూపతి లక్ష్మీనృసింహస్వామికి కిలో ముత్యాలను ఆలయ సూపరింటెండెంట్ బంగారునాయుడుకు అందజేశారు.