సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో కూడా ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు.