ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏప్రిల్ 23న విజయవాడలోని సిద్దార్థ జూనియర్ కాలేజ్లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తున్నాయి.