‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి ఫస్ట్లుక్ విడుదల చేసింది చిత్రబృందం. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. రష్మికకు జంటగా శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.