ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జోరుమల్య బాగ్చి సోమవారం ఉదయం 10 గంటల 15 నిముషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సిజె జెకె.మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకుముందు కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై ఎపి కి వచ్చారు. ఎపి హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్ బాగ్చి రెండో స్థానంలో కొనసాగనున్నారు. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఈ నెల 6 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి సిక్కిం హైకోర్టు సిజె గా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు హైకోర్టు న్యాయమూర్తులు జెకె మహేశ్వరికి వీడ్కోలు పలకనున్నారు.