ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా మరో 48 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో 9284మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 48 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 7 , కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జల్లాలో 4,అనంతపురం జిల్లా నుంచి 3 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లా నుంచి ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 47కు చేరింది.