ఏపీలో కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు
ఏపీలో కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1016కు చేరింది. వీరిలో మొత్తం 171 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటి వరకు 31 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, క్రిష్ణాలో 25, కర్నూలులో 14, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి.