కత్తి మహేష్ పై కేసు నమోదు
కత్తి మహేష్ పై కేసు నమోదు

కత్తి మహేష్ పై కేసు నమోదు

శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఉమేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు.