మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరేకు కరోనా సోకింది. కరోనా చికిత్స నిమిత్తం మంగళవారం ఆమె ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మార్చి 22న ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్థారణైందని, అప్పటి నుండి హోమ్ క్వారంటైన్లో ఉంటున్నట్లు వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈనెల 11న ఉద్ధవ్ థాకరే, ఆయన రష్మీలు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. రష్మీ థాకరే శివసేన అనుబంధ పత్రిక ‘సామ్నా’కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.