కరోనాతో జడ్జి మృతి

కరోనా కోరలకు ఒక జడ్జీ బలయ్యాడు. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జీ నజీర్‌ ఇటీవల కరోనా బారిన పడ్డారు. స్థానిక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొలుకున్నాక ఇంటికి వద్దానుమనుకున్న సమయంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఆకస్మాత్తుగా పడిపోయింది. దీంతో అనారోగ్యం పాలైన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఆయన చనిపోయారు. జడ్జి నజీర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.