కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు జగన్ శంకుస్థాపన

విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు కృష్టా నది ఎడమవైపున వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) నిర్మాణానికి సిఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శంకుస్ధాపన చేశారు. 1.5 కిలోమీటర్ల మేర రూ.122.90 కోట్ల వ్యయంతో కృష్ణా నది వరద ఉధృతిని తట్టుకునేలా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. ఈ గోడ నిర్మాణంతో కృష్ణా నది కరకట్టకు చెందిన రాణీగారితోట, తారకరామానగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌ ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 31 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలుగనుంది.