చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి
చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి

బీసీలు టీడీపీకి పట్టుగొమ్మ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవో తీసుకొచ్చారన్నారు. ఈ తరుణంలో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్‌ వేయించి చంద్రబాబు మోకాలొడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ అధ్యక్షతన జరిగిన మల్లేశ్వరం మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చంద్రబాబు ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే అన్నారు.