చంద్రబాబు పై మండిపడ్డ రోజా
చంద్రబాబు పై మండిపడ్డ రోజా

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్సార్‌పీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. చంద్రబాబులా పబ్లిసిటీ పిచ్చి సీఎం జగన్‌కు లేదన్నారు. చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదని విమర్శించారు