ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫేం వర్ష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె లైవ్లోకి వచ్చి ప్రకటించారు. ‘రెండు రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. అందులో పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని లైవ్లోకి వచ్చి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే.. బయట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చనిపోయిన వారిని ప్యాక్ చేసి పడేస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తుంటే గుండె తరుక్కుపోయి ఈ విషయాన్ని లైవ్లో వచ్చి చెప్పాలని అనుకున్నాను’ అని ఆమె అన్నారు. కాగా.. అందరూ జాగ్రత్తగా ఉండండి. రోజు వేడి నీళ్లు తాగండి. ఎన్ని జాగ్రత్తలు ఉంటే అన్నీ తీసుకోండని ఆమె సూచించారు.