డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌
డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌

డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌

క‌రోనా బాధితులకు నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్ట‌ర్ల ఆరోగ్యం దృష్ట్యా కేజ్రివాల్ ప్ర‌భుత్వం ప‌లు కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని లోక్‌నాయ‌క్‌, జీబీ పంత్ ఆసుప‌త్రుల‌లో ప‌నిచేస్తున్న వైద్యుల‌ను ల‌లిత్ హోట‌ల్‌లో ఉంచ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ వేగంగా ప్ర‌బలుతున్న నేప‌థ్యంలో విధుల్లో ఉన్న వైద్య‌నిపుణులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను 14 రోజుల‌పాటు ల‌లిత్ హోట‌ల్‌లోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది. ప్రాణాంత‌క ఈ వైర‌స్ డాక్ట‌ర్లు, వారి కుటుంబాల‌కు కూడా సోకుతున్న నేప‌థ్యంలో స‌ర్కార్ ఈ ప్ర‌ణాళిక ద్వారా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వచ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఢిల్లీ ప్ర‌భుత్వం సోమ‌వారం ట్వీట్ చేసింది.