సినీ నటి హేమ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ను రాశారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ అర్హత పరీక్ష రాశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 580 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్లైన్లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. అర్హత సాధించిన అ్యభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని వివరించారు.