ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ  రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. మాజీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ అనంతరం 2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బైజల్‌ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదంతో బైజల్  పలుసార్లు వార్తల్లో నిలిచారు.