తమన్నాకు కరోనా పాజిటివ్‌

తమన్నా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన తమన్నా..హైఫీవర్‌ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరగా…అనంతరం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా, ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా..కోలుకున్నారు. ప్రస్తుతం తమన్నా సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం, అంధధూన్‌ రీమేక్‌లో టబు పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌ కూడా ఓకే చెప్పారు.