తాజ్‌ మహల్‌ ను సందర్శించనున్న ట్రంప్‌ దంపతులు

తాజ్‌ మహల్‌ ను సందర్శించుకున్న ట్రంప్‌ దంపతులు

అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు ముగిశాయి. అనంతరం తన పర్యటనలో భాగంగా… ట్రంప్‌ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్‌ మహల్‌ ను సందర్శించేందుకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్‌ మహల్‌ ను ట్రంప్‌ దంపతులు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్‌ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మోడి రాక సందర్భంగా.. ఆగ్రాను, తాజ్‌ మహల్‌ పరిసరాలను సుందరంగా అలంకరించారు.