తిరుమలలో సెలబ్రిటీల సందడి నెలకొంది. తిరుమల వెంకటేశ్వరుడిని ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. హీరోయిన్ అనన్య మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో వెంకటేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించగా టిటిడి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, మధ్యప్రదేశ్ సిఎస్ గోపాల్ రెడ్డి లు విఐపి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్ధప్రసాదాలను అందచేశారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అభివఅద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.