కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుధవారం నుండి 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చింది. అనంతరం అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలన్నీ నిలిచిపోతున్నాయి. లాక్డౌన్ సమయంలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.