కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో నటుడు చిరంజీవి దీనిపై ట్వీట్ చేశారు. ‘ఈ వైరస్ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతోంది. అలక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు రాకండి. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ వేసుకోండి. వాక్సినేషన్ తీసుకోండి. దీనివల్ల కరోనా సోకినా ప్రభావం తక్కుగా ఉంటుంది. పాజిటివ్ వచ్చినా పానిక్ కావొద్దు. మన భయమే మనలను చంపుతోంది. పాజిటివ్ వస్తే ఐసోలేషన్లోకి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. నలత, ఊపిరి సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. హాస్పటిల్లో చేరండి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మీ బాడీలో యాండీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడినవారవుతారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని, మన ఊరిని, తద్వారా మన దేశాన్ని కాపాడుకుందాం’ అని పేర్కొన్నారు.