నేటి నుండి నామినేషన్ల పరిశీలన..

 ఎపి లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు ముగిశాయి. నేడు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4 నామినేషన్ల ఉపసంహరణ కు తుది గడువు. ఫిబ్రవరి 9 న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ తొలిదశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.