పవన్ కళ్యాణ్కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ”జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స అందిస్తున్నారు.