పోలవరంలో జగన్‌ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేశారు. తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల తీరును పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులు జగన్‌కు వివరించారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రాజెక్టు సమావేశ మందిరంలో నిర్మాణ పనులపై ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్‌ సమీక్షించారు. సీఎం కొన్ని సూచనలు కూడా చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు.