పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాసుపత్రి ఘటన : వాసిరెడ్డి పద్మ

పోలీసుల నిర్లక్యం వల్లే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళపై అత్యాచార ఘటన చోటుచేసుకుందని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రానా టాటాతో శనివారం ఆమె భేటీ అయ్యారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌ ఘటనపై చర్చించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తుపై కమిషనర్‌తో చర్చించామన్నారు. అందుకే సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేయించామని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తామని సీపీ చెప్పారన్నారు. ఇకపై మిస్సింగ్‌ కేసులపై వేగంగా స్పందించాలని సీపీకి సూచించినట్టు వెల్లడించారు.