‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకుంది. 30 ఏళ్లలోపు యువతీ యువకుల్లో అత్యంత ప్రతిభావంతులైన 30 మంది జాబితాను తాజాగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. వినోద రంగంలో కీర్తి సురేష్కు ఈ గౌరవం దక్కింది. దక్షిణాది నుంచి కీర్తి ఒక్కతే ఈ చోటు సంపాదించింది. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నందుకు గర్వంగా ఉందని కీర్తి సురేష్ తెలిపింది.