రష్మిక బాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ను అందుకుంది. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వికాస్ భల్ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందే సినిమాలో నటించడానికి రష్మిక ఓకే చెప్పింది. తండ్రీ, కూతుళ్ల మధ్య నడిచే అనుబంధాలు, భావోద్వేగాల కథతో రూపొందే ఈ చిత్రంలో అమితాబ్కు కూతురిగా రష్మిక నటించనుంది. ఇందులో ప్రముఖ నటి నీనా గుప్తా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చి నెలలో మొదలు కానుంది. ఈ చిత్రానికి ‘డెడ్లీ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.