బాలూకు ‘భారత్న రత్న’ కోరుతూ జగన్‌ లేఖ

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. 4 దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవకు గాను భారతరత్నతో సత్కరించాలని కోరారు. కాగా, కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడటంతో పాటు తనదైన ముద్రతో ఆ పాటలకు వన్నె తెచ్చారు. లిపిలేని భాషల్లో సైతం ఆయన పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సినీ సంగీతంలో ఆయన పేరు చిరస్మరణీయం.