బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్‌ లో నటించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎస్‌ఆర్‌ నగర్‌లోని మధురానగర్‌లో తన నివాసంలో ఉమంగళవారం అర్థరాత్రి ఉరివేసుకున్నారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన శ్రావణి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో డోర్‌ను పగలకొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.