భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు

భారత్‌లో మతస్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఏర్పడిందని, దేశంలో మైనార్టీలపై గత ఏడాది పొడుగునా హత్యలు, దాడులు, బెదిరింపులు కొనసాగాయని అమెరికా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2021 నివేదికను కాంగ్రెస్‌లో గురువారం అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌ మాట్లాడుతూ ‘ప్రార్థనా స్థలాలపై పెరుగుతున్న దాడుల కారణంగా మైనార్టీలు ముప్పులో ఉన్నారు’ అని తెలిపారు. 2021లో భారత్‌లో ఏడాది పొడుగునా వివిధ ప్రదేశాల్లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు.