తెలంగాణ మంత్రి కెటిఆర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిందని, టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని మంత్రి కెటిఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి తీసుకున్న అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు. బుధవారమే కెటిఆర్ కు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలను నిర్వహించారు. గురువారం వాటన్నింటినీ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందని డాక్టర్లు తెలిపారు.