‘ ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ను మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తేజపరిచే, ఫలవంతమైన నిర్ణయాలతో ఇద్దరి మధ్య బంధాలు బలపడేలా చేశారని గుర్తుచేసుకున్నారు. భారతదేశంపై తనకున్న ఆసక్తి, మహాత్మాగాంధీ జీవితం, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా రాసుకున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ అసాధారణ జ్ఞానం, మర్యాద కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. నవంబర్ 2010లో మొదటిసారి భారత్ను సందర్శించానని, ఆ సందర్భంగా.. ‘సున్నితమైన, మృదువుగా మాట్లాడే స్వభావం గల ఆర్థికవేత్త ను కలుసుకున్నానని అన్నారు. అలాగే అతని తలపాగా, తెల్లని గడ్డం సిక్కు విశ్వాసానికి చిహ్నాలుగా ఉన్నాయని కొనియాడారు.