మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు చెంపపెట్టుగా ప్రజానీకం ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులు జి.ఓబులేశు, వి.ఉమామహేశ్వరరావు, పి.గౌతంరెడ్డి ఈ మేరకు ప్రకటించారు. అంతకు ముందు విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రాస్తారోకోలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఐదవ తేదిన విశాఖ నగర బంద్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.